సాక్షి ప్రతినిధి, ఏలూరు : బీజేపీతో పొత్తు పేరుతో నాటకం ఆడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చివరకు ఆ పార్టీతో తెగతెంపులు చేసుకోవడం కొరివితో తల గోక్కున్నట్టయ్యిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే టీడీపీలో నెలకొన్న వర్గ రాజకీయూలు, వలస నేతలను అక్కున చేర్చుకుని పార్టీ శ్రేణులను అభాసుపాలు చేసిన ఘటనలు టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిన్నటివరకూ బీజేపీతో పొత్తు అంటూ దొంగాట ఆడి చివరకు ఆ పార్టీకి రాంరాం చెప్పడం గోరుచుట్టపై రోకలి పోటులా పరిణమిస్తుందని పార్టీ శ్రేణులు పేర్కొం టున్నారుు.
పొత్తంటూనే దొంగాట
నిన్నటివరకూ బీజేపీతో పొత్తు అంటూనే చంద్రబాబు నాయుడు దొంగాట ఆడా రు. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటామంటూ కొందరు నేతలతో ప్రచారం చేయించి.. మరోవైపు నరసాపురం పార్లమెంటరీ స్థానం అభ్యర్థిని మార్చాలని పట్టుబట్టించడం టీడీపీ, బీజేపీలను ఇరకాటంలో పడేసింది. తాడేపల్లిగూడెం స్థానాన్ని కూడా బీజేపీకి ఇచ్చినట్టే ఇచ్చి చివరకు టీడీపీ తరఫున కొట్టు సత్యనారాయణతో నామినేషన్ వేయించారు. ఈ తరహా నాటకాలు అటు బీజేపీ, ఇటు టీడీపీ శ్రేణులను అయోమయూనికి గురిచేశాయి.
ఇదీ వ్యూహం
బీజేపీ-టీడీపీ మధ్య పొత్తు కుదరకముందే పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణంరాజును చంద్రబాబు వ్యూహాత్మకంగా బీజేపీలో చేర్పించారు. పొత్తులో భాగంగా నరసాపురం ఎంపీ స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని ఆ పార్టీతో చర్చలకు ముందే చంద్రబాబు నిర్ణయించారు. ఆ తర్వాత అక్కడ తన మనిషే ఉండేలా చూసుకునేందుకు రఘురామకృష్ణంరాజును బీజేపీలోకి పంపించారు. తద్వారా నరసాపురం సీటును బీజేపీకి ఇచ్చి ఆ స్థానంలో తన మద్దతుదారుడే బరిలో ఉండేలా వ్యూహం రచించారు. ఈ వ్యూహం కచ్చితంగా ఫలించి రఘురామకృష్ణంరాజుకే బీజేపీ సీటు వస్తుందని అంతా భావిం చారు. అనూహ్యంగా మరో పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు తెరపైకి రావడంతో చంద్రబాబు-రఘురామకృష్ణం రాజు వ్యూహం బెడిసికొట్టింది. గంగరాజు సంఘ్ పరివార్కు చెందిన వ్యక్తి కావడంతో బీజేపీ ఆయన వైపే మొగ్గు చూపింది.
అయినా రఘురామరాజు చివరివరకూ బీజేపీ అగ్ర నాయకులపై ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు కూడా రఘురాజుకు సీటివ్వాలని తన కోటరీ ద్వారా లాబీయింగ్ చేయించారు. కానీ చివరికి బీజేపీ గంగరాజుకే సీటు కేటాయించడంతో చంద్రబాబు వ్యూహం అట్టర్ ఫ్లాప్ అయింది. మరోవైపు తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి ఇచ్చినట్టే ఇచ్చి అక్కడి నేతలతో ఒత్తిడి చేరుుంచి.. చివరకు అక్కడినుంచి కూడా టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపే వ్యూహం రచించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం రాత్రి నుంచి పొత్తు లేదనే ప్రచారాన్ని ప్రారంభించి బీజేపీ నేతలపై ఒత్తిడి పెంచారు. మరోవైపు బీజేపీ సీటు దక్కని రఘురామకృష్ణంరాజు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. చివరికి నరసాపురం సీటు దక్కించుకునేందుకు బాబు రఘురామరాజుతో గురువారం నామినేషన్ వేయిం చడం విశేషం. ఆయన ఒకటి బీజేపీ తరఫున, మరొకటి టీడీపీ తరఫున రెండు సెట్ల నామినేషన్లు వేయడం విశేషం. గంగరాజును మార్చి రఘురామకృష్ణంరాజుకు సీటిస్తే పోటీలో ఉండేందుకు అనువుగా బీజేపీ తరఫున, లేనిపక్షంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు వీలుగా ఆ పార్టీ పేరుతో నామినేషన్ వేయడం గమనార్హం.
అలాగే తాడేపల్లిగూడెంలో మాజీ ఎమ్మె ల్యే కొట్టు సత్యనారాయణ కూడా నామినేషన్ వేశారు. ఆయన్ను కూడా టీడీపీ తరఫున పోటీలో ఉంచేందుకు పావులు కదుపుతున్నారు. ఇదంతా బీజేపీని ఇరుకునపెట్టి నరసాపురం, తాడేపల్లిగూడెం సీట్లను దక్కించుకునేందుకు చంద్రబాబు ఆడించిన నాటకమేనని స్పష్టంగా అర్థమవుతోంది. దీంతో బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాడని తెలిసి కూ డా పొత్తుకు ఒప్పుకోవడం తమ పార్టీ చేసిన తప్పని బీజేపీ నేతలు చెబుతున్నారు. బాబు ఎత్తులకు లొంగేది లేదని బీజేపీ నాయకత్వం స్పష్టం చేస్తున్నట్టు సమాచారం. పొత్తు పేరిట చంద్రబాబు బీజేపీని ముప్పతిప్పలు పెడుతుండటంపై ఆ పార్టీలో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఇదేంటయ్యూ చంద్రం
Published Fri, Apr 18 2014 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement