టీడీపీ-కాంగ్రెస్ బాహాబాహీ | TDP and Congress workers clash | Sakshi
Sakshi News home page

టీడీపీ-కాంగ్రెస్ బాహాబాహీ

Apr 25 2014 4:01 PM | Updated on Mar 18 2019 9:02 PM

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారి తీసింది. టిడిపి-కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

రంగారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ఘర్షణకు దారి తీసింది. టిడిపి-కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. రంగారెడ్డిజిల్లా ఇబ్రహింపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలంలో ఈ గొడవ జరిగింది.

టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ప్రసంగిస్తుండగా అదే గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కొంత మంది కార్యకర్తలకు స్వల్పగాయాలుకాగా, నాలుగు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల రాకతో గొడవ సద్దుమణిగింది. పోలీసులు ఘటనా స్థలంలో పికెట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement