ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు! | IN one house 211 fraud votes | Sakshi
Sakshi News home page

ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు!

Apr 11 2014 2:45 AM | Updated on Aug 14 2018 4:21 PM

ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు! - Sakshi

ఒకే ఇంట్లో 211 బోగస్ ఓట్లు!

ఒక ఇంట్లో 211మంది ఓటర్లు ఉన్నారు. అసలు ఇల్లే లేని నెంబరుతో మరో 59 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చేసిన మామజాలం వెలుగుచూసింది.

కర్నూలు, న్యూస్‌లైన్: ఒక ఇంట్లో 211మంది ఓటర్లు ఉన్నారు. అసలు ఇల్లే లేని నెంబరుతో మరో 59 మంది ఓటర్లు ఉన్నారు. టీడీపీ అభ్యర్థి గెలుపు కోసం ఆ పార్టీ నాయకులు చేసిన మామజాలం వెలుగుచూసింది. కర్నూలు నగరం 26వ వార్డులోని అరోర నగర్ (బీక్యాంపు)లోని 73వ బూత్‌లో సీరియల్ నం.613 నుంచి 824 వరకు 49-50ఏ-87 ఇంటి నంబరుపై 211 మంది ఓటర్లు ఉన్నారు.

76వ బూత్ పరిధిలోని వరుస నం. 364 నుంచి 423 వరకు 49-50ఏ-87సీ ఇంట్లో 59 మంది ఓటర్లు ఉన్నట్లుగా జాబితాలో పేర్లు ఉన్నాయి. అసలు ఆ నంబరుతో ఇల్లేలేదు. వీరందరూ బోగస్ ఓటర్లే. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఇబ్బడిముబ్బడిగా బోగస్ ఓటర్లు ఉన్నారని గురువారం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అశోక్‌బాబుకు వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement