ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమవంతు ప్రయత్నం కొనసాగిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు.
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తమవంతు ప్రయత్నం కొనసాగిస్తామని ఏపీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుంటూరులో విలేకరులతో మాట్లాడారు.
ఏపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము రాజీపడబోమని చెప్పారు. బీజేపీ మిత్రపక్షం అయినంత మాత్రాన చేతులు ముడుచుకుని కూర్చోమంటూ ప్రత్తిపాటి పుల్లరావు స్పష్టం చేశారు.