సాగర్‌ నీటిని విడుదల చేయాలి | To release sagar water | Sakshi
Sakshi News home page

సాగర్‌ నీటిని విడుదల చేయాలి

Aug 21 2016 11:23 PM | Updated on Sep 4 2017 10:16 AM

సాగర్‌ నీటిని విడుదల చేయాలి

సాగర్‌ నీటిని విడుదల చేయాలి

మిర్యాలగూడ: నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.

మిర్యాలగూడ: నాగార్జునసాగర్‌ ఎడమ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని టీఆర్‌ఎస్‌ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలో∙ఏర్పాటు చేసిన విలేకరుల సమావే«శంలో మాట్లాడారు. బోర్లు ఎండిపోయి పత్తి, కంది, పెసర పంటలు ఎండిపోయేస్థితిలో ఉన్నాయన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని కోరారు. బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ చేసి, రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పురుగు మందులను 50శాతం సబ్సిడీతో ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండేటి జలంధర్, మిర్యాల మధుసూదన్, రామచంద్రారెడ్డి, రామిరెడ్డి, పందుల జానికిరాములు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement