ఎండాకాలం...దొంగల సీజన్.. | Theives robbered in house at Kamalapuram | Sakshi
Sakshi News home page

ఎండాకాలం...దొంగల సీజన్..

Mar 19 2016 2:24 PM | Updated on Sep 2 2018 5:06 PM

కుటుంబసభ్యులంతా ఎండా కాలం వేడికి తట్టుకోలేక ఆరుబయట నిద్రించగా అదును చూసి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి సొత్తంతా మూటగట్టుకు పోయారు.

కమలాపురం(వైఎస్సార్): కుటుంబసభ్యులంతా ఎండా కాలం వేడికి తట్టుకోలేక ఆరుబయట నిద్రించగా అదును చూసి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి సొత్తంతా మూటగట్టుకు పోయారు. తెల్లారిన తర్వాత విషయం తెలుసుకున్న బాధితులు ఘొల్లుమన్నారు. వైఎస్సార్ జిల్లా కమలాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.

పట్టణానికి బూతం సాంబశివుడు, ఆయన కుటుంబసభ్యులు శుక్రవారం రాత్రి ఆరుబయట పడుకున్నారు. ఇదే అదనుగా ఇంటి వెనుక నుంచి లోపలికి ప్రవేశించిన దొంగలు .. బీరువాను పగులగొట్టి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.10వేల నగదును ఎత్తుకుపోయారు. తెల్లవారిన తర్వాత చూసుకున్న సాంబశివుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై శ్రీనివాసులురెడ్డి సంఘటన స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. క్లూస్‌టీంను రప్పించి, విచారణ ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement