లాడ్జిలో ఘరానా దోపిడీ!! | theft in kurnool lodging | Sakshi
Sakshi News home page

లాడ్జిలో ఘరానా దోపిడీ!!

Nov 20 2015 1:54 PM | Updated on Sep 3 2017 12:46 PM

కర్నూలు జిల్లాలో ఓ లాడ్జిలో ఘరానా దోపీడీ చోటుచేసుకుంది.

ఆత్మకూరు: కర్నూలు జిల్లాలో ఓ లాడ్జిలో ఘరానా దోపీడీ చోటుచేసుకుంది. ఓ న్యాయవాదికి దుండగుడు మత్తుమందిచ్చి బంగారు ఆభరణాలను దోచుకుపోయాడు. గుంటూరు జిల్లాకు చెందిన న్యాయవాది శ్రీహరిరావు ఆత్మకూరు లాడ్జిలో దిగాడు. అదే లాడ్జిలో హైదరాబాద్ దిల్‌సుఖ్ నగర్ ప్రాంతానికి చెందిన రామిరెడ్డి అనే వ్యక్తి కూడా దిగాడు.

 

పరిచయం పెంచుకున్న రామిరెడ్డి... శ్రీహరిరావుకు మత్తు మందిచ్చి అతడి ఒంటిపై ఉన్న బంగారంతో పాటు, సెల్‌ఫోన్‌ను తీసుకుని పరారయ్యాడని భావిస్తున్నారు. అచేతనంగా పడి ఉన్న శ్రీహరిరావును లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ మొదలు పెట్టారు. శ్రీహరిరావు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement