పాఠాలు బోధించిన ఎమ్మెల్యే | teacher, mla, kasturba | Sakshi
Sakshi News home page

పాఠాలు బోధించిన ఎమ్మెల్యే

Jul 18 2016 12:07 AM | Updated on Sep 4 2017 5:07 AM

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను ఆదివారం తనిఖీకి వెళ్లిన ఆయనకు అక్కడ ఆటలాడుకుంటున్న విద్యార్థులు కనిపించారు.

నెన్నెల : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఉపాధ్యాయుడి అవతారమెత్తారు. మండల కేంద్రంలోని కస్తూరిబా పాఠశాలను ఆదివారం తనిఖీకి వెళ్లిన ఆయనకు అక్కడ ఆటలాడుకుంటున్న విద్యార్థులు కనిపించారు. వారితో మాట్లాడారు.  మెనూ ప్రకారం భోజనం పెడుతున్నార లేదా అని అడిగి తెలుసుకున్నారు. పాఠ్యపుస్తకాల్లోంచి ప్రశ్నలు అడిగారు.  పుస్తకం తీసుకుని స్వయంగా పాఠాలు బోధించారు.  రాఖీ పండుగ, అశోకుడు చెట్లు నాటిన విషయం గూర్చి పిల్లలకు వివరించారు. టీచర్లు అందుబాటులో లేక పోవడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు విధ్యార్థులకు అందుబాటులో ఉండి విద్యాబుద్దులు నేర్పించాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement