పెట్టుబడిదారులకు ఊడిగం | Tammineni Veerabhadram comments on both state CMs | Sakshi
Sakshi News home page

పెట్టుబడిదారులకు ఊడిగం

Nov 2 2016 3:49 AM | Updated on Aug 15 2018 9:35 PM

పెట్టుబడిదారులకు ఊడిగం - Sakshi

పెట్టుబడిదారులకు ఊడిగం

పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు భూము లు, కరెంట్ రాయితీలు ఇస్తూ తెలుగు రాష్ట్రా ల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పోటీపడి ఊడిగం చేస్తున్నారని

ఇద్దరు సీఎంలపై తమ్మినేని ధ్వజం
 
 బిజినేపల్లి/నాగర్‌కర్నూల్ రూరల్: పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు భూము లు, కరెంట్ రాయితీలు ఇస్తూ తెలుగు రాష్ట్రా ల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ పోటీపడి ఊడిగం చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. తెలంగాణ మహా జన పాదయాత్ర మంగళవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి, నాగర్‌కర్నూల్ పట్టణాల్లో సాగింది. 

తమ్మినేని మాట్లాడుతూ పారిశ్రామిక విధానంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు మొదటిస్థానంలో నిలబడితే ప్రజారైతు సంక్షేమంలో మాత్రం చివరి స్థానానికి చేరాయని విమర్శించారు. ఈ విషయం నీతి ఆయోగ్ సర్వేలో తేలిందని చెప్పారు. పేదలకు ఇస్తామన్న ఇళ్లు, భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. కొత్త రాష్ట్రాల్లో పాత పద్ధతిలోనే పాలన సాగుతుందని, పాలకులు మారారే తప్ప విధానాలు మాత్రం మారలేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement