తల్లి మృతిని జీర్ణించుకోలేక కుమారుడు... | son committed suicide after Mothers death | Sakshi
Sakshi News home page

తల్లి మృతిని జీర్ణించుకోలేక కుమారుడు...

Apr 22 2016 10:09 AM | Updated on Nov 6 2018 7:56 PM

తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుమారుడు కూడా బలవన్మరణం చెందాడు.

తల్లి మరణాన్ని తట్టుకోలేక ఆమె కుమారుడు కూడా బలవన్మరణం చెందాడు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం బేతంపూడి పంచాయతీ వెంకట్యాతండాలో చోటుచేసుకుంది. రుణ భారంతో తీవ్ర వేదనకు గురైన తండాకు చెందిన భూక్య చంది(45) ఈనెల 20వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి ఆమె కుమారుడు రవి(30) తీవ్ర ఆవేదన చెందుతున్నాడు.

 

గురువారం రాత్రి ఇంట్లోనే పురుగు మందు తాగాడు. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు అతడిని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయాడు. అతనికి భార్య రోజా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారం రోజుల్లోనే ఆ ఇంట్లో ఇద్దరు చనిపోవటంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement