శ్రీవారి వెండి డాలర్ల విక్రయం | Sakshi
Sakshi News home page

శ్రీవారి వెండి డాలర్ల విక్రయం

Published Thu, Sep 22 2016 11:13 PM

శ్రీవారి వెండి డాలర్లు

 
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవారి వెండి డాలర్లు గురువారం నుండి విక్రయం ప్రారంభించారు. ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావు ఈ కొత్త కౌంటర్‌ను ప్రారంభించారు. మూడేళ్లుగా ఈ వెండి డాలర్లు విక్రయం నిలిపేశారు. భక్తుల విజ్ఞప్తితో టీటీడీ ఈవో డాక్టర్‌ దొండపాటి సాంబశివరావు స్పందించి వెండిడాలర్లు విక్రయంచేయాలని  ఆదేశించారు. ఆమేరకు ఐదు గ్రాముల  వెండి డాలరు రూ.475 చొప్పున విక్రయించారు. తొలి డాలర్‌ను ఆలయ డెప్యూటీఈవో కోదండరామారావుకు ఆంధ్రాబ్యాంక్‌ చీఫ్‌ మేనేజరు వి.సుబ్రమణ్యం విక్రయించారు. 
 
 
 

Advertisement
 
Advertisement