11న తమిళనాడు గవర్నర్‌ రోశయ్య రాక | rosaih come to the godavarikani | Sakshi
Sakshi News home page

11న తమిళనాడు గవర్నర్‌ రోశయ్య రాక

Aug 1 2016 11:39 PM | Updated on Sep 4 2017 7:22 AM

ఈ నెల 11న గోదావరిఖనిలో జరిగే ఆర్యవైశ్య మహాసభ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య హాజరవుతున్నారని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, సదస్సు కన్వీనర్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు.

గోదావరిఖని : ఈ నెల 11న గోదావరిఖనిలో జరిగే ఆర్యవైశ్య మహాసభ ఉత్తర తెలంగాణ ప్రాంతీయ సదస్సులో పాల్గొనడానికి తమిళనాడు గవర్నర్‌ రోశయ్య హాజరవుతున్నారని మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ, సదస్సు కన్వీనర్‌ కోలేటి దామోదర్‌ తెలిపారు. స్థానిక అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య సంఘం భవనంలో ఆరు జిల్లాలకు చెందిన వైశ్య ప్రముఖులతో సోమవారం సమావేశం జరిగింది. గోదావరిఖని   ఆర్జీ–1 కమ్యూనిటీహాల్‌లో నిర్వహించే సదస్సుకు మంత్రి ఈటల రాజేందర్, ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే గణేష్‌గుప్తా, రామగుండం నగర మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణతదితరులు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల అభివృద్ధి, సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని  చెప్పారు. ఓసీలలో ఉన్న పేదలకు రిజర్వేషన్లు కల్పించాలని, ప్రభుత్వ రాయితీలు వర్తింపచేయాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు.  వైశ్యుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక ఫెడరేషన్‌ ఏర్పాటు చేయాలని, ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్తింటి వెంకటేశ్వర్లు, కోశాధికారి జి.మల్లికార్జున్, వివిధ జిల్లాల బాధ్యులు రాజన్న, యాద అంజయ్య, నర్సిన సంతోష్, చిదురాల రవీందర్, నాగన్న, జగన్మోహన్, అశోక్, వైకుంఠం, కాంతయ్య, విజయ్‌కుమార్, బల్లు చంద్రప్రకాష్‌ గుప్తా, వెనిశెట్టి నటరాజశేఖర్, గుండా లక్ష్మికాంతం, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement