కదిరి రూరల్ మండలం కె.బ్రాహ్మణపల్లిలో ఆర్ఎంపీ ఆనంద్ గురువారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు.
కదిరి అర్బన్ : కదిరి రూరల్ మండలం కె.బ్రాహ్మణపల్లిలో ఆర్ఎంపీ ఆనంద్ గురువారం రాత్రి దారుణహత్యకు గురయ్యాడు. తన భర్త కనపడటం లేదని భార్య రోష్ని ఈ నెల 4న కదిరి రూరల్ పోలీస్టేçÙన్లో ఫిర్యాదు చేసింది. ఆమెపై ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఆనంద్ కె.బ్రాహ్మణపల్లిలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలో మహిళ బంధువులే దారుణంగా హత్య చేసి వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో మృతదేహాన్ని పడేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహం కోసం రాత్రంతా వెతికినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఎస్ఐ వెంకటప్రసాద్ను వివరణ కోరగా..ఆనంద్ మృతదేహం కోసం గాలించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అది అది దొరక్కపోవడంతో వెనుదిరిగి వచ్చామన్నారు.


