శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆస్పత్రిలో చేరారు.
ఆస్పత్రిలో చేరిన టీటీడీ ప్రధాన అర్చకుడు
Jan 30 2017 6:13 PM | Updated on Sep 5 2017 2:29 AM
తిరుమల: శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆస్పత్రిలో చేరారు. సోమవారం సాయంత్రం ఆయన తన ఇంట్లో ప్రమాదవశాత్తు జారిపడ్డారు. గాయపడిన ఆయన్ను కుటుంబసభ్యులు ఆలయ అధికారుల సాయంతో చికిత్స నిమిత్తం తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
Advertisement
Advertisement