రెవెన్యూలో పదోన్నతులు | promotions in revenue | Sakshi
Sakshi News home page

రెవెన్యూలో పదోన్నతులు

Jan 10 2017 11:49 PM | Updated on Jun 1 2018 8:39 PM

రెవెన్యూ శాఖలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇస్తూ మంగళవారం కలెక్టర్‌ కోన శశిధర్‌ ఉత్తర్వులను జారీ చేశారు.

అనంతపురం అర్బన్‌ : రెవెన్యూ శాఖలో తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లకు పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇస్తూ మంగళవారం కలెక్టర్‌ కోన శశిధర్‌ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రస్తుతం అడహక్‌ పోస్టింగ్‌లో ఉన్నవారికి రెగ్యులర్‌ పోస్టింగ్‌ ఇచ్చారు. అలాగే కొందరు డీటీలకు పదోన్నతుల కల్పిస్తూ  పోస్టింగ్‌ ఇచ్చారు. లక్ష్మీనాయక్‌ను కదిరి డీఏఓ, మహబూబ్‌బాషాను రొద్దం తహశీల్దార్‌గా రెగ్యులర్‌ చేశారు. అలాగే పుట్టపర్తి సీఎస్‌డీటీగా పనిచేస్తున్న సరస్వతికి పదోన్నతి కల్పిస్తూ డీఏఓ పెనుకొండకు బదిలీ చేశారు.

ఓడీసీ ఆంజినేయులును రెగ్యులర్‌ చేశారు. రాప్తాడు సీఎస్‌డీటీగా పనిచేస్తున్న సోమశేఖర్‌ను కలెక్టర్‌ జి సెక‌్షన్‌ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించారు. అలాగే సెలవులో ఉన్న శివయ్యను డ్వామా సూపరింటెండెంట్‌గా నియమించారు. పదోన్నతులు కల్పించడంపై కలెక్టర్‌కు రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, కార్యదర్శి నీలకంఠారెడ్డి, కోశాధికారి కుళ్లాయప్ప ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement