ఆరెపల్లి గ్రామస్తుల నిర్ణయం
ఇప్పటికే గ్రామపంచాయతీతీర్మానం
గ్రామంపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ
అందరికీ బ్యాంకు ఖాతాలు, ఏటీఎంలు అందించడంపై దృష్టి
గీసుకొండ : వంద శాతం నగదు రహిత లావాదేవీలు సాధించే దిశగా గీసుకొండ మండలంలోని ఆరెపల్లి గ్రామం అడుగులు వేస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో రైతులు, సామాన్యులు ఇబ్బందులు పడుతుండగా నగదు రహిత లావాదేవీలు జరిగేలా గ్రామాల్లో ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ మేరకు ఆరెపల్లి గ్రామస్తులు కూడా పూర్తిగా నగదు రహిత లావాదేవీలవైపు మొగ్గుచూపాలని గ్రామపంచాయతీలో తీర్మానం కూడా చేశారు. ఈక్రమంలోనే గ్రామంలో 18ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి బ్యాంకు అకౌంట్ ఉండేలా చర్యలు చేపట్టారు.
పూర్తయిన సర్వే
గ్రామంలో ఎంత మందికి అకౌంట్లు ఉన్నాయో, లేని వారెవరు అనేది తెలుసుకోవడానిని సాక్షర భారత్ గ్రామ కోఆర్డినేటర్ ద్వారా ఇంటింటి సర్వే చేయించారు. ఈ సందర్భంగా గ్రామంలో 602 మందికి బ్యాంకు అకౌంట్లు లేని వారు కేవలం 25 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వీరందరికీ త్వరలో బ్యాంకు ఖాతాలను తెరిపించే పనిలో సర్పంచ్, తదితరులు నిమగ్నమయ్యారు. గ్రామంలోని చాలా మందికి మండలంలోని ఊకల్ కార్పొరేషన్ బ్యాంకు, మచ్చాపూర్లోని గ్రామీణ వికాస్ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయి. అయితే, ఖాతాలు ఉండడమే కాదు.. అందరికీ ఏటీఎం కార్డులు ఇప్పించేందుకు చర్యలు చేపట్టారు. గ్రామంలో కార్పొరేషన్ బ్యాంకు మినీ శాఖ ఉండగా.. ఇక్కడ స్వైప్ మిషన్ వాడుతున్నారు. అలాగే రెండు కిరాణాషాపులతో పాటు ఇద్దరు మక్కల వ్యాపారులు గ్రామంలో ఉన్నారు. వీరికి సైతం త్వరలో స్వైప్ మిషన్లు ఇప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సర్పంచ్తో కలెక్టర్ సమీక్ష
ఆరెపల్లె గ్రామంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావడంతో ఈనెల 19వ తేదీన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ తుమ్మనపెల్లి శ్రీనివాస్తో పాటు పలువురునగదు రహిత లావాదేవీల విషయమై కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో ఆయన ఈ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ మరుసటి రోజు సర్పంచ్ను పిలిపించుకుని నగదు రహిత లావాదేవీలు జరిగే గ్రామాన్ని తీర్చిదిద్దాలని.. ఇందుకు తన సహకారం ఉంటుందని తెలిపారు. అంతే కాకుండా ఆంధ్రాబ్యాంకు మేనేజర్ను పిలిపించి అందరికీ ఖాతాలు ఉండేలా చూడాలని సూచించారు. రాష్ట్ర భారీ పరిశ్రమలశాఖ మంత్రి హరీష్రావు ఇప్పటికే సిద్ధిపేటలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని పూర్తిగా నగదురహిత లావాదేవీలు జరిగేలా తీర్చిదిద్దారు. ఇక్కడ కూడా అనుకున్నవన్నీ సజావుగా జరిగితే త్వరలోనే ఆరెపల్లె కూడా ఇబ్రహీంపూర్ సరసన నిలవనుంది.
15 రోజుల్లో పూర్తి చేస్తా
తుమ్మనపెల్లి శ్రీనివాస్, గ్రామ సర్పంచ్
రానున్న 15 రోజుల్లో గ్రామంలోని అందరికీ బ్యాంకు ఖాతాలతో పాటు ఏటీఎం కార్డులు అందేలా కృషి చేస్తున్నాం. ఆ తర్వాత స్వైప్మిషన్ల ద్వారా లావాదేవీలు జరిగేలా చర్యలు చేపడుతున్నాం. గ్రామం నుంచి నగరానికి వెళ్లి ఆర్థిక లావాదేవీలు చేసే వారి వద్ద ఏటీఎం కార్డులు ఉండటంతో నగదు కొరత సమస్య ఎదురుకాదు.
నగదు రహితం వైపు అడుగులు
Published Tue, Dec 27 2016 2:19 AM
Advertisement
Advertisement
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
ఐఫోన్ ఇక్కడ కొంటే భారీ డిస్కౌంట్..
హమాస్ చెరలో బందీలుగా.. నలుగురిని కాపాడిన ఇజ్రాయెల్
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్గా సోనియా.. రాహుల్ నిర్ణయంపైనే ఉత్కంఠ
T20 World Cup 2024: రషీద్ ఖాన్ ఈజ్ ద బెస్ట్
అర్జున్ సర్జా ఇంట పెళ్లి వేడుకలు.. హీరోయిన్ హల్దీ పిక్స్ వైరల్
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
మృగశిర కార్తె ఎఫెక్ట్ : కిక్కిరిసిన రాంనగర్ చేపల మార్కెట్ (ఫొటోలు)
ప్రెగ్నెన్సీతోనే హీరోయిన్ డ్యాన్స్.. చీరలో రీతూ అలా!
ప్రపంచంలో 7000 ‘జాంబీ కంపెనీలు’.. ఏంటివి?
తప్పక చదవండి
- T20 World Cup 2024: నిప్పులు చెరిగిన సౌతాఫ్రికా పేసర్లు
- పెరగనున్న ఫర్నిచర్ ధరలు.. కారణం ఇదే..
- ఎర్త్ రైజ్ ఫోటోతో ప్రపంచాన్నే మార్చేసిన నాసా ఆస్ట్రోనాట్ దుర్మరణం
- పెళ్లి చేసుకున్న 45 ఏళ్ల కమెడియన్.. వీడియో వైరల్
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
- పుణే కేసు నిందితుడిపై ‘బుల్డోజర్’ ప్రయోగం
- రాకేశ్ రెడ్డి.. ధైర్యంగా ఉండండి: కేటీఆర్
- Russia: భారతీయ వైద్య విద్యార్థుల మృతదేహాలు వెలికితీత
- సౌత్ హీరోలు ఫేక్.. పైకి మాత్రం తెగ నటిస్తారు: బాలీవుడ్ ఫోటోగ్రాఫర్
- ఏపీలో దాడుల వెనుక ఆ ఇద్దరు: పేర్ని నాని
Advertisement