
టాటాతో ఒప్పందం చారిత్రకం: చంద్రబాబు
విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో 264 గ్రామాలను రతన్ టాటా దత్తత తీసుకున్నారని సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
విజయవాడ: విజయవాడ లోక్సభ స్థానం పరిధిలో 264 గ్రామాలను ప్రముఖ పారిశ్రామివేత్త రతన్ టాటా దత్తత తీసుకున్నారని సోమవారం సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఖనిజ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు రతన్ టాటా ముందుకు రావాలని సీఎం కోరారు.
రతన్ టాటాతో చేసుకునే ఎంవోయూ ఓ చారిత్రక ఒప్పందం అని అన్నారు. విలువలతో కూడిన వ్యాపారానికి టాటా ప్రాధాన్యత ఇచ్చారని చెప్పారు. భావితరాల పారిశ్రామికవేత్తలకి రతన్ టాటా ఆదర్శప్రాయుడని కొనియాడారు. రాష్ట్రంలో వనరులకు కొదవలేదని పారిశ్రామికవేత్తలే ముందుకు రావల్సి ఉందని చంద్రబాబునాయుడు అన్నారు. సీఎస్ఆర్ కింద గ్రామాల దత్తత విజయవాడ నుంచి ప్రారంభమవడం కావడం సంతోషకరమన్నారు.