రైలులోంచి పడి యువకుడి మృతి | man dies of train accident | Sakshi
Sakshi News home page

రైలులోంచి పడి యువకుడి మృతి

Jan 31 2017 10:50 PM | Updated on Sep 5 2017 2:34 AM

రైలులోంచి పడి యువకుడి మృతి

రైలులోంచి పడి యువకుడి మృతి

కదులుతున్న రైలులోంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గుంతకల్లు పట్టణంలోని పోర్టర్‌లైన్‌కు చెందిన అంబ్రోస్‌ జోసఫ్‌ (20) డ్రమ్స్‌ కొట్టేందుకు తాడిపత్రికి వచ్చాడు.

తాడిపత్రి రూరల్‌ : కదులుతున్న రైలులోంచి ప్రమాదవశాత్తు జారిపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. గుంతకల్లు పట్టణంలోని పోర్టర్‌లైన్‌కు చెందిన అంబ్రోస్‌ జోసఫ్‌ (20) డ్రమ్స్‌ కొట్టేందుకు తాడిపత్రికి వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం పని ముగించుకుని స్వగ్రామానికి వెళ్లేందుకు తాడిపత్రి రైల్వేస్టేషన్‌లో ముంబై- చెన్నై ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కాడు. రైలు కదులుతున్న సమయంలో ప్రమాదవశాత్తు జారి కిందపడటంతో జోసఫ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement