ఏ కష్టమొచ్చిందో.. | man dies of train accident | Sakshi
Sakshi News home page

ఏ కష్టమొచ్చిందో..

Dec 28 2016 10:24 PM | Updated on Sep 4 2017 11:49 PM

ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తి రైలుకింద పడి ప్రాణం తీసుకున్నాడు.

కదిరి టౌన్‌ : ఏ కష్టమొచ్చిందో ఏమో తెలియదు కానీ గుర్తు తెలియని వ్యక్తి రైలుకింద పడి ప్రాణం తీసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కదిరి రైల్వేస్టేషన్‌కు ఫర్లాంగు దూరంలోని బ్రిడ్జి సమీపాన ట్రాక్‌పై ఓ వ్యక్తి తలపెట్టి పడుకున్నాడు. ఆ మార్గంలో వచ్చిన గుంతకల్లు- తిరుపతి ప్యాసింజర్‌ రైలు దూసుకెళ్లడంతో ఆ వ్యక్తి తల, మొండెం వేరయ్యాయి. ఈ భయానక దృశ్యాన్ని చూసేందుకు జనం తరలివచ్చారు. అయితే మృతుడి వివరాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement