వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.
కొత్తవలస: వేగంగా వస్తున్న లారీ అదుపుతప్పి బైక్ను ఢీకొట్టిన ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తాడివానిపాలెం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉపాధి హామీ పథకంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న లక్ష్మణరావు(40) బైక్ వెళ్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.