కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం | madanaiah committed suicide at son's burried place | Sakshi
Sakshi News home page

కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం

Sep 6 2015 1:23 PM | Updated on Sep 3 2017 8:52 AM

కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం

కుమారుడి సమాధి వద్దే తండ్రి బలవన్మరణం

కుమారుడి మరణం తట్టుకోలేక ఓ తండ్రి కుమారుడి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి మండలం షెట్‌పల్లిలోచోటుచేసుకుంది.

ఆదిలాబాద్(కోటపల్లి): కుమారుడి మరణం తట్టుకోలేక ఓ తండ్రి కుమారుడి సమాధి వద్ద ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోటపల్లి మండలం షెట్‌పల్లిలోచోటుచేసుకుంది. వివరాలు..గ్రామానికి చెందిన మోతె మదనయ్య(60)కు మోతె రవి(30) ఒక్కగానొక్క కుమారుడు. కుటుంబ కలహాల కారణంగా గతేడాది రవి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతి తట్టుకోలేక అప్పటి నుంచి ఓ పిచ్చివాడిలా తిరిగేవాడని స్థానికులు చెబుతున్నారు.

పురుగుల మందు తాగి కుమారుడి సమాధి వద్ద ఆదివారం విగతజీవిగా పడి ఉన్నాడు. మదనయ్య చనిపోయినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement