కడప రైల్వే స్టేషన్‌లో బాలికల కలకలం | Kadapa railway station caused Girls | Sakshi
Sakshi News home page

కడప రైల్వే స్టేషన్‌లో బాలికల కలకలం

Jul 27 2016 6:46 PM | Updated on Sep 19 2018 8:32 PM

కడప రైల్వే స్టేషన్‌లో బాలికల కలకలం - Sakshi

కడప రైల్వే స్టేషన్‌లో బాలికల కలకలం

కడప రైల్వేస్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం బాలికలు కలకలం రేపారు. 13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు గల 11 మంది బాలికలు చెన్నైకి వెళ్లడానికి స్టేషన్‌కు చేరుకున్నారు. వారి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు ఐసీడీఎస్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు

కడప రూరల్‌ :
కడప రైల్వేస్టేషన్‌లో బుధవారం మధ్యాహ్నం బాలికలు కలకలం రేపారు.  13 నుంచి 16 ఏళ్ల మధ్య వయస్సు గల 11 మంది బాలికలు చెన్నైకి వెళ్లడానికి స్టేషన్‌కు చేరుకున్నారు. వారి సమాధానాలు అనుమానాస్పదంగా ఉండటంతో రైల్వే పోలీసులు ఐసీడీఎస్‌ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం వివరాల మేరకు..11మంది బాలికలు చెన్నైకి కుట్టుశిక్షణకు వెళుతున్నట్లుగా తెలిపారు. వారికి సంరక్షకులమంటూ నాన్న, అన్న, మేనమామలుగా చెప్పుకునే 10మంది వరకు ఉన్నారు.

వారు చెప్పిన వివరాల మేరకు చెన్నైలోని శిక్షణ కేంద్రాల యాజమాన్యాలకు ఫోన్‌ చేయగా, వారి నుంచి అస్పష్టమైన సమాధానం వచ్చింది. దీనికితోడు అటు బాలికలు, ఇటు వారివెంట ఉన్న పెద్దలు కూడా పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఐసీడీఎస్‌ పీడీ రాఘవరావు బాలికలను సీడబ్లు్యసీ (చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ)కి అప్పగించారు. బాలికలకు బంధువులుగా చెప్పుకునే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఐసీడీఎస్‌ పీడీ రాఘవరావు మాట్లాడుతూ ఇండియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం ఇచ్చిన సమాచారం మేరకు కడప రైల్వేస్టేçÙన్‌లో బాలికలను అదుపులోకి తీసుకున్నామన్నారు. దీనిపై విచారణ చేపడతామని, అవసరమైతే ప్రభుత్వపరంగా బాలికలకు ఇక్కడే ఉచితంగా కుట్టుశిక్షణ ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement