ఊడిన బస్సు స్టీరింగ్... ప్రయాణికుల ఆందోళన | Just Missed In Big Accident of RTC Bus in anantapur | Sakshi
Sakshi News home page

ఊడిన బస్సు స్టీరింగ్... ప్రయాణికుల ఆందోళన

Oct 23 2015 8:24 AM | Updated on Jun 1 2018 8:39 PM

ఊడిన బస్సు స్టీరింగ్... ప్రయాణికుల ఆందోళన - Sakshi

ఊడిన బస్సు స్టీరింగ్... ప్రయాణికుల ఆందోళన

అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది.

అనంతపురం : అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సుకు శుక్రవారం తృటిలో ప్రమాదం తప్పింది. వజ్రకరూర్ మండలం గుళపాళ్యం వద్ద వేగంగా వెళ్తున్న బస్సు ఆకస్మాత్తుగా... స్టీరింగ్ ఊడిపోయింది. దీంతో బస్సులోని ప్రయాణీకులు తీవ్ర ఆందోళనతో బిగ్గరగా కేకలు వేశారు. బస్సు డ్రైవర్ రాముడు చాకుచక్యంగా వ్యవహరించి.. బస్సును నిలిపివేశాడు.

దాంతో ప్రయాణీకులంతా ఊపిరిపిల్చుకున్నారు. అనంతరం ఆర్టీసీ ఉన్నతాధికారులకు డ్రైవర్ సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు మరో బస్సులో ప్రయాణీకులను వారివారి గమ్యస్థానాలకు తరలించారు.  ఉరవకొండ డిపోకు చెందిన బస్సు శుక్రవారం ఉదయం ఉరవకొండ నుంచి గుంతకల్లు బయలుదేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement