మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించిన జేసీ | JC observed lunch dishes | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించిన జేసీ

Jan 6 2017 11:00 PM | Updated on Mar 21 2019 8:19 PM

మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించిన జేసీ - Sakshi

మధ్యాహ్న భోజన వంటలు పరిశీలించిన జేసీ

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ శివలింగయ్య నిర్వాహకులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సోమవార్‌పేట్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు.


నిర్మల్‌టౌన్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ శివలింగయ్య నిర్వాహకులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సోమవార్‌పేట్‌ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు. ఎంఈవో విద్యాధికారి సురేశ్, కౌన్సిలర్‌ మేడారం అపర్ణ, ప్రధానోపాధ్యాయుడు రఘురాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి
18ఏళ్లు నిండిన యువతీయువకులు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని జేసీ శివలింగయ్య పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం ఓటు ఆవశ్యకతపై నిర్వహించిన డిజిటల్‌ ప్రెజెంటేషన్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. ఎంఈవో సురేశ్, కౌన్సిలర్‌ మేడారం అపర్ణ, నాయకులు మేడారం ప్రదీప్, ప్రధానోపాధ్యాయుడు రఘురాజ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement