మానుకోటలో భవనాలు పరిశీలించిన ఐజీ | IG watch th Manukota buildings | Sakshi
Sakshi News home page

మానుకోటలో భవనాలు పరిశీలించిన ఐజీ

Sep 18 2016 12:05 AM | Updated on Sep 4 2017 1:53 PM

మానుకోటలో భవనాలు పరిశీలించిన ఐజీ

మానుకోటలో భవనాలు పరిశీలించిన ఐజీ

మానుకోట జిల్లా ఎస్పీ కార్యాలయానికి పట్టణ శివారులో కేటాయించిన ఐటీఐ భవనం, ఎస్పీ క్యాంప్‌ కార్యాలయం కోసం తీసుకున్న అద్దె భవనాన్ని ఐజీ మల్లారెడ్డి, రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝా శనివారం పరిశీలించారు. ఐటీఐ భవనంలో గదులు, నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, తదితర విషయాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మహబూబాబాద్‌ : మానుకోట జిల్లా ఎస్పీ కార్యాలయానికి పట్టణ శివారులో కేటాయించిన ఐటీఐ భవనం, ఎస్పీ క్యాంప్‌ కార్యాలయం కోసం తీసుకున్న అద్దె భవనాన్ని ఐజీ మల్లారెడ్డి, రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిషోర్‌ఝా శనివారం పరిశీలించారు. ఐటీఐ భవనంలో గదులు, నీటి సౌకర్యం, రోడ్డు సౌకర్యం, తదితర విషయాలపై స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పాటు నేపథ్యంలో తాత్కాలిక కార్యాలయాల కోసం తీసుకున్న భవనాలు సంతృప్తికరంగా ఉన్నాయని తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. 11న కార్యాలయాల ఏర్పాటు కోసం రంగం సిద్ధం చేశామని చెప్పారు. అనంతరం కలెక్టరేట్‌ కోసం కేటాయించిన వైటీసీ భవనాన్ని కూడా ఆయన పరిశీలించారు. కార్యాలయానికి రోడ్డు సౌకర్యం కల్పిం చేందుకు కృషిచేయాలని ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ను కోరగా అంగీకరించారు. ఐజీతో డీఎస్పీ బి.రాజమహేంద్రనాయక్, సీఐ నందిరామ్‌నాయక్, సిబ్బం ది పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement