అధ్యయనానికి వచ్చిన రచయిత్రులు
సిరిసిల్లటౌన్ : చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న నేతకార్మికుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని ప్రజాస్వామిక రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు అనిశెట్టి రజిత కోరారు. సిరిసిల్లలోని పవర్లూం కార్మికుల జీవితాలపై అధ్యయనానికి శనివారం రచయిత్రుల సంఘం వచ్చింది.
-
చాలని వేతనాలతో అవస్థలు పడుతుండ్రు
-
పవర్లూం కార్మికులపై అధ్యయనం
-
ప్రజాస్వామిక రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు రజిత
-
సిరిసిల్లలో రచయిత్రుల బృందం పర్యటన
సిరిసిల్లటౌన్ : చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు పడుతున్న నేతకార్మికుల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపాల్సిన అవసరం ఉందని ప్రజాస్వామిక రచయిత్రుల సంఘం అధ్యక్షురాలు అనిశెట్టి రజిత కోరారు. సిరిసిల్లలోని పవర్లూం కార్మికుల జీవితాలపై అధ్యయనానికి శనివారం రచయిత్రుల సంఘం వచ్చింది. బృంద సభ్యులు కార్మిక స్థితిగతులను పరిశీలించింది. రజిత మాట్లాడుతూ తక్కువ వేతనాలతో కార్మికులు కుటుంబాలను సైతం వెల్లదీయలేకపోతున్నారన్నారు. కార్మికుల కోసం మరిన్ని సంక్షేమ పథకాలు చేపట్టాలని, హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. సిరిసిల్లలోని కార్మికుల జీవన విధానంపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి విన్నవించనున్నట్లు తెలిపారు. కార్మికుల శ్రమను దోచుకుంటూ యజమానులు కోట్లకు పడగలెత్తుతున్నారన్నారు. సంఘం కార్యదర్శి బండారు విజయ, జిల్లా కన్వీనర్ కొలిపాక శోభారాణి, సభ్యులు శివలక్ష్మి, మంజుల, మడుపు రత్నాదేవి, వైద్యులు నళిని, సమత, విద్యాదేవి, శ్యామల తదితరులు పాల్గొన్నారు.