రూ.15 కోట్లకు అమ్ముడుపోయాడు.. | GUDIVADAAmarnath criticism on the Araku MLA kidari | Sakshi
Sakshi News home page

రూ.15 కోట్లకు అమ్ముడుపోయాడు..

Apr 29 2016 3:03 PM | Updated on Aug 20 2018 3:54 PM

అరకులోయ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రూ.15 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని... వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు.

- అరకు ఎమ్మెల్యే కిడారిపై విమర్శలు గుప్పించిన గుడివాడ అమర్‌నాథ్

అరకులోయ (విశాఖ)

అరకులోయ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు రూ.10 నుంచి రూ.15 కోట్లకు అధికార పార్టీకి అమ్ముడుపోయారని... వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. శుక్రవారం అరకులోయలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలోఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రా ఊటీ అయిన అరకులోయను లూటీ చేసేందుకే ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సీఎం చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. దమ్ముంటే కిడారితో రాజీనామా చేయించాలని... అరకులోయ ప్రజలు గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మెజారిటీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపిస్తారని సవాల్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement