'కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు' | Former MP Ponnam comments over PM Modi, CM KCR | Sakshi
Sakshi News home page

'కులమతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చు'

May 30 2016 2:30 PM | Updated on Oct 3 2018 7:42 PM

మతం పేరుతో ప్రధాని మోదీ, కులం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు.

యాదగిరిగుట్ట (నల్గొండ జిల్లా) : మతం పేరుతో ప్రధాని మోదీ, కులం పేరుతో తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. నల్గొండ జిల్లా యాదగిరి గుట్టలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో అశాంతి రేకెత్తిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొడుతూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement