అనంతపురం సప్తగిరి సర్కిల్:మొక్కల పెంపకం కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడు తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని వక్తలు సూచించారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సభను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.
మొక్కల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ
Jun 19 2017 11:50 PM | Updated on Aug 16 2018 4:36 PM
అనంతపురం సప్తగిరి సర్కిల్:మొక్కల పెంపకం కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడు తుందని, ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలని వక్తలు సూచించారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ వర్ధంతి సభను జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాతోపాటు, కర్నూలు, తెలంగాణ, కొస్తాంధ్రలోని ఏజెన్సీ ప్రాంతాల్లోని 1605 గ్రామాల్లో 4 లక్షల మొక్కలను నాటారు. జిల్లాలోని ఆర్డీటీ సెంటర్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్డీటీ హాస్పిటాలిటీ డైరెక్టర్ విశాల ఫెర్రర్, చైర్మ¯ŒS తిప్పేస్వామి ముఖ్య అతిథులుగా హాజరై ఆ యా గ్రామాల వారికి మొక్కలను అందజేశారు. ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ సేవలను కొనియాడారు. ఆయన ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతరం ఫాదర్ ఘాట్ వద్ద నివాళులరి్పంచారు. ఆర్డీటీ ఎకాలజీ డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి, డైరెక్టర్లు నిర్మల్కుమార్, జేవియర్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement