తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. కలియుగదైవం శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి ప్రస్తుతం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది. నిన్న(ఆదివారం) స్వామివారిని 78,143 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.