నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు | degree semister exams start today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

Apr 14 2017 11:18 PM | Updated on Sep 5 2017 8:46 AM

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో రెండు, నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ రెడ్డివెంకటరాజు తెలిపారు.

ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో రెండు, నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎవాల్యుయేషన్స్‌ డైరెక్టర్‌ రెడ్డివెంకటరాజు తెలిపారు. తొలిసారిగా ఆన్‌లైన్‌ ప్రశ్నాపత్రానికి వాటర్‌మార్క్‌ విధానం అమలు చేస్తున్నామన్నారు. నిర్ధేశించిన సమయం కంటే గంట ముందు పరీక్ష కేంద్రం వద్దకు రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిచ్చేదిలేదన్నారు. ఏప్రిల్‌ 28న పాలిసెట్‌ పరీక్ష ఉన్నందున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement