: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నానికి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.
మచిలీపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని నానికి కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. మచిలీపట్నంలోని స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా ధర్నా చేపట్టిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. బందరు పోర్టు భూసేకరణ, మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల వేధింపులకు నిరసనగా సోమవారం మచిలీపట్నంలో పేర్ని నాని ధర్నా నిర్వహించారు. దీంతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు.