
మేయర్ దంపతుల హత్యకేసులో నిందితుడిపై దాడి
చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్యకేసులో మరో నిందితుడు గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో లోంగిపోయాడు.
చిత్తూరు: చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ల హత్యకేసులో మరో నిందితుడు గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో లోంగిపోయాడు. ఈ కేసులో పదో నిందితుడిగా ఉన్న మొగిలి(35) హత్య జరిగిన నాటి నుంచి పరారీలో ఉన్నాడు.
గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో మొగిలి లొంగిపోవటాన్ని తెలుసుకున్న కఠారి అనుచరులు అక్కడికి చేరుకుని అతనిపై దాడిచేశారు. ఈ ఘటనలో మొగిలికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కఠారి అనుచరులను తీవ్రంగా హెచ్చరించడంతో అతనిని వదిలేశారు. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.