వాహనాల తనిఖీల్లో రూ.35లక్షలు స్వాధీనం! | Checks of vehicles seized Rs 35 lakh! | Sakshi
Sakshi News home page

వాహనాల తనిఖీల్లో రూ.35లక్షలు స్వాధీనం!

Nov 12 2016 1:14 AM | Updated on Jun 1 2018 8:39 PM

సరైన పత్రాలు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.35లక్షల నగదును వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని పార్నపల్లె రింగ్‌ రోడ్డులో టౌన్‌ ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది.

పులివెందుల : సరైన పత్రాలు లేకుండా వాహనంలో తరలిస్తున్న రూ.35లక్షల నగదును వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో పట్టుకున్నారు. గురువారం అర్ధరాత్రి పట్టణంలోని పార్నపల్లె రింగ్‌ రోడ్డులో టౌన్‌ ఎస్‌ఐ గోపీనాథ్‌రెడ్డి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక కారు అనుమానాస్పదంగా కనిపించింది. కారుకు సంబంధించిన పత్రాలు చూపించకపోవడంతో అనుమానంతో తనిఖీ చేయగ అందులో దాదాపు రూ.35లక్షల నగదు దొరికినట్లు సమాచారం. అవన్నీ పాత రూ.500, రూ.1000  నోట్లు అని తెలిసింది. కేంద్రప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేయడంతో ఒక వాహనంలో ఇంత పెద్దమొత్తం దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. నగదును చెన్నై నుంచి అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కూచువారిపల్లెకు తరలిస్తున్నట్లుగా తెలిసింది. వాహనంలోని వ్యక్తి తాను అరటికాయల వ్యాపారినని, రైతులకు చెల్లించేందుకు నగదును తీసుకెళుతున్నట్లు పోలీసులకు తెలిపినట్లు సమాచారం. పూర్తినిజాలు తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement