కాటమరాయుడికే శఠగోపం | cash scham in kadiri temple | Sakshi
Sakshi News home page

కాటమరాయుడికే శఠగోపం

Feb 16 2017 11:14 PM | Updated on Aug 20 2018 8:20 PM

కాటమరాయుడికే శఠగోపం - Sakshi

కాటమరాయుడికే శఠగోపం

ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సొమ్మును కొందరు ఇంటి దొంగలు కాజేస్తున్నారు. భక్తులు విరాళాల రూపంలో ఇచ్చే మొత్తంలో సగం మాత్రమే స్వామివారి ఖాతాకు జమచేస్తూ.. మిగిలిన దాన్ని తమ జేబుల్లోకి వేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

- భక్తుల విరాళాలు కొందరి జేబుల్లోకి..
-  ప్రతినెలా రూ.15 లక్షల దాకా స్వాహా
కదిరి :
ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి సొమ్మును కొందరు ఇంటి దొంగలు కాజేస్తున్నారు. భక్తులు విరాళాల రూపంలో ఇచ్చే మొత్తంలో సగం మాత్రమే స్వామివారి ఖాతాకు జమచేస్తూ.. మిగిలిన దాన్ని తమ జేబుల్లోకి వేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇలా రోజుకు రూ.50 వేల చొప్పున నెలకు రూజ15 లక్షల దాకా శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తోంది.

    ఖాద్రీ నృసింహుని దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా  కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. కేవలం హుండీల ద్వారానే ఆలయానికి రోజుకు రూ. లక్ష దాకా ఆదాయం వస్తోంది. ఆలయంలోని నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేసే ప్రతి భక్తుడూ తమ స్తోమతకు తగ్గట్టు ఎంతోకొంతో విరాళాన్ని అందజేస్తుంటారు. భక్తుల నుంచి తీసుకునే ఈ విరాళాలకు ఆలయ సహాయ కమిషనర్‌ కేటాయించిన  సిబ్బంది అక్కడికక్కడే రసీదులు కూడా ఇస్తుంటారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత పాలక మండలి సభ్యులు కొందరు ఏకంగా బిల్లు పుస్తకాలను చేతబట్టుకొని భక్తుల నుంచి నేరుగా విరాళాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు విమర్శలొస్తున్నాయి.

అనంతపురంలోని కొవ్వూరు నగర్‌కు చెందిన ఎం.సూర్యనారాయణరెడ్డి అనే భక్తుడు గత ఏడాది ఆగస్టు మూడో తేదీన శ్రీవారిని దర్శించుకుని.. నిత్యాన్నదానం కోసం రూ.40 వేల విరాళమిచ్చారు. ఈ మొత్తాన్ని తీసుకున్న పాలక మండలి సభ్యుడొకరు నిత్యాన్నదాన పథకం పుస్తకం నుంచి ఒరిజినల్‌ రసీదు(నెం.75921) ఇచ్చారు. ఆ రశీదు తీసుకొని ఆ భక్తుడు Ððవెళ్లిపోయారు. కాకపోతే రశీదు రాసేటప్పుడు కింద కార్బన్‌ పేపర్‌ పెట్టనందున ఆ భక్తుడి వివరాలేవీ అందులో నమోదు కాలేదు. ఆ డబ్బు మాత్రం రశీదు రాసిన ఆలయ కమిటీ సభ్యుడి జేబులోకి వెళ్లింది. అదే రశీదు నంబర్‌ కార్బన్‌ కాపీలో విరాళమిచ్చిన ఆ భక్తుడి పేరు కూడా మార్చేసి ఆర్‌.రాధాక్రిష్ణ అని రాశారు. కేవలం 48 కిలోల బియ్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై ‘సాక్షి’ నిఘా పెట్టిందన్న విషయం తెలుసుకున్న సదరు సభ్యుడుఽ 75901 సీరియల్‌ నంబర్‌తో నకిలీ బిల్లు బుక్కు ముద్రించి.. అందులో 75921 రశీదు నంబర్‌లో గతంలో ఏ భక్తుడైతే రూ.40 వేలు ఇచ్చారో అదే విషయం కనబరిచారు. ఈ మొత్తాన్ని స్వామివారి ఖాతాలో జమ చేసినట్లు రికార్డుల్లో రాసుకున్నారు.

విచారణ చేపడతాం –వెంకటేశ్వరరెడ్డి, ఆలయ సహాయ కమిషనర్‌
అన్నదానం కోసం భక్తులు సమర్పిస్తున్న విరాళాల్లో గోల్‌మాల్‌ జరుగుతున్న విషయం ఇప్పటిదాకా నా దృష్టికి రాలేదు. సదరు బిల్లు పుస్తకం పరిశీలిస్తాం. నిజమని తేలితే తగు చర్యల కోసం పై అధికారులకు నివేదిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement