ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల | AP edset Results Release | Sakshi
Sakshi News home page

ఏపీ ఎడ్‌సెట్ ఫలితాలు విడుదల

Jun 3 2016 1:05 AM | Updated on Mar 28 2019 5:30 PM

బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్- 2016 ఫలితాలను ఎస్వీయూ వీసీ దామోదరం గురువారం విడుదల చేశారు.

జూలై రెండో వారంలో కౌన్సెలింగ్
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్- 2016 ఫలితాలను ఎస్వీయూ వీసీ దామోదరం గురువారం విడుదల చేశారు. గత నెల 23న 18 పట్టణాల్లోని 27 పరీక్ష కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు.ఫలితాలు విడుదల సందర్భంగా  వీసీ దామోదరం మాట్లాడుతూ.. ఈ పరీక్షలో 96.16 శాతం మంది అర్హత పొందారని తెలిపారు. ఎడ్‌సెట్‌కు  9,561మంది హాజరు కాగా వారిలో 9,194 మంది అర్హత సాధించారని చెప్పారు. ఈ ఫలితాల్లో బాలురదే స్వల్పంగా పైచేయి కన్పించిందన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి తీసుకున్న అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రకటిస్తామన్నారు. జూలై రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించాలని భావిస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement