రేపటి బంద్ను అణగదొక్కాలని టీడీపీ సర్కార్ చూస్తోందని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని ఆరోపించారు.
ఏలూరు : రేపటి బంద్ను అణగదొక్కాలని టీడీపీ సర్కార్ చూస్తోందని పశ్చిమగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల నాని ఆరోపించారు. శుక్రవారం ఏలూరులో ఆళ్ల నాని మాట్లాడుతూ... తమ పార్టీ నేతలను హౌస్ అరెస్ట్ చేయాలనే కుట్ర జరుగుతోందని విమర్శించారు. జిల్లాలో 30, 144 సెక్షన్లు విధించడం అన్యాయమన్నారు.
ప్రత్యేక హోదా కోసం అరెస్ట్లకైనా తాము సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం చేసే కుట్రను తిప్పి కొడతామని ఆళ్ల నాని పేర్కొన్నారు.