కన్నేపల్లి వద్ద నిర్మించనున్న పంప్హౌజ్ కింద భూములు కోత్పోతున్న నిర్వాసితుల భూములను ఏజేసీ నాగేంద్ర, ఆర్డీవో బాల శ్రీనివాస్లు మంగళవారం పరిశీలించి రైతులతో చర్చించారు. రైతులు ఏజేసీతో భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు.
పంప్హౌజ్ భూముల పరిశీలిలన
Aug 23 2016 11:18 PM | Updated on Sep 4 2017 10:33 AM
కాళేశ్వరం: కన్నేపల్లి వద్ద నిర్మించనున్న పంప్హౌజ్ కింద భూములు కోత్పోతున్న నిర్వాసితుల భూములను ఏజేసీ నాగేంద్ర, ఆర్డీవో బాల శ్రీనివాస్లు మంగళవారం పరిశీలించి రైతులతో చర్చించారు. రైతులు ఏజేసీతో భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. దీంతో ఆయన చేసేదేమీ లేక తిరిగి వెళ్ళారు. విలేకర్లతో ఏజేసీ మాట్లాడుతు రైతులను ఒప్పించిన తరువాతనే ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మొదలుపెడుతామని తెలిపారు. అనంతరం బెగులూర్ గ్రామంలో విషజ్వరాలతో పలువురు అస్వస్థతకు గురికాగా గ్రామాన్ని సందర్శించి వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సరైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ జయంత్, వీఆర్వోలు ఉన్నారు.
Advertisement
Advertisement