మాజీ భర్తను దక్కించుకోవాలని సవతిపై అఘాయిత్యం

Woman Masterminds Molestation On Ex Husband Wife In Haryana - Sakshi

చండీగఢ్‌ : హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను మరో మహిళ చిత్రహింసలకు గురి చేసింది. అంబాలాలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత డిసెంబర్‌లో భర్త నుంచి విడాకులు తీసుకున్న నిందితురాలు.. అతడిపై పగ సాధించాలనుకుంది. ఇటీవల తన మాజీ భర్త రెండో పెళ్లి చేసుకోవడంతో అతడి కాపురాన్ని కూల్చాలని తన కుంటుంబంతో కలిసి పథకం పన్నింది.

కుటుంబ సభ్యులతో కలిసి బాధితుడి ఇంటిపై దాడి చేసిన సదరు మహిళ.. భార్యభర్తలను కిడ్నాప్‌ చేసి.. రెండు వేర్వేరు వాహనాల్లో వారిని పానిపట్‌కు తరలించారు. తన మాజీ భర్తకు విడాకులు ఇవ్వాలని బాధితురాలిని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె అంగీకరించక పోవడంతో తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఆమెపై సామూహిక అత్యాచారానికి ఉసిగొల్పింది. దాదాపు పదకొండున్నర గంటలు చిత్రహింసలు పెట్టిన అనంతరం గురువారం ఉదయం బహదుర్‌ఘర్‌లో బాధితులను విడిచిపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అకృత్యానికి పాల్పడిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, అత్యాచారానికి పాల్పడిన ఇద్దరిలో ఒకరిని గురుగ్రామ్‌లో అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top