మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి | two person killed his friend for mobile in hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో ఘర్షణ.. ఒకరు మృతి

Feb 21 2018 7:40 AM | Updated on Sep 4 2018 5:07 PM

two person killed his friend for mobile in hyderabad - Sakshi

మృతిచెందిన రత్నాకర్‌ రాజు

సాక్షి, హైదరాబాద్‌: ఎస్‌నగర్‌ పీఎస్‌ పరిధిలోని తులసీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వివరాలివి.. నిందితుడు నవీన్‌ అనే వ్యక్తి తన ఇంట్లో మంగళవారం రాత్రి ఇద్దరి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. అనంతరం అతని కొత్త మొబైల్‌ కనిపించలేదు. దీంతో వారి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో మాట మాట పెరిగి వారి గొడువ ఇంకా పెరిగింది. స్నేహితుల దాడిలో రత్నాకర్‌ రాజు అనే వ్యక్తి మృతి చెందాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన ప్రదేశానికి చేరుకున్నారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని నవీన్‌, పూర్ణను అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీస్‌ అధికారి మాట్లాడుతూ.. ముగ్గురు స్నేహితులు కలిసి నవీన్‌ ఇంట్లో పార్టీ చేసుకున్నారు. ‘ నవీన్‌, పూర్ణ కలిసి ఇటీవల కొత్త ఫోన్‌ కొనుకున్నారు. పార్టీ అనంతరం రత్నాకర్‌ రాజు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత వారి మొబైల్‌ కనిపించలేదు. దీంతో వారు వెళ్లిపోయిన అతనిపై అనుమాన పడ్డారు. మద్యం మత్తులో కోపొద్రిక్తులైన వారు రత్నాకర్‌పై దాడి చేసి పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటనలో రత్నాకర్‌ అక్కడిక్కడే మరణించాడు’ అని పోలీస్‌ అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement