11 కేవీ విద్యుత్‌ లైన్‌కు స్టాండ్‌ తగలడంతో..

Three Died With Electrocution In Chilakaluripet Guntur District - Sakshi

గుంటూరు జిల్లాలో ముగ్గురు కార్మికుల మృతి

విద్యుత్‌ దీపాలు బాగు చేస్తుండగా ఘటన

సాక్షి, గుంటూరు : చిలకలూరిపేట మండలం తాతపూడికొండలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్‌ బంక్‌లోని విద్యుత్‌ దీపాలు రిపేర్‌ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మౌలాలీ, శేఖర్‌, శ్రీనివాసరావు అనే ముగ్గురు కార్మికులు మరణించారు. విద్యుత్‌ దీపాలను బాగు చేసేందుకు ఐరన్‌ స్టాండ్‌ను తీసుకెళ్తుండగా.. అది 11 కేవీ విద్యుత్‌ లైన్‌కు తగలడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top