11 కేవీ విద్యుత్‌ లైన్‌కు స్టాండ్‌ తగలడంతో.. | Three Died With Electrocution In Chilakaluripet Guntur District | Sakshi
Sakshi News home page

11 కేవీ విద్యుత్‌ లైన్‌కు స్టాండ్‌ తగలడంతో..

Jan 18 2020 1:00 PM | Updated on Jan 18 2020 1:14 PM

Three Died With Electrocution In Chilakaluripet Guntur District - Sakshi

సాక్షి, గుంటూరు : చిలకలూరిపేట మండలం తాతపూడికొండలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పెట్రోల్‌ బంక్‌లోని విద్యుత్‌ దీపాలు రిపేర్‌ చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మౌలాలీ, శేఖర్‌, శ్రీనివాసరావు అనే ముగ్గురు కార్మికులు మరణించారు. విద్యుత్‌ దీపాలను బాగు చేసేందుకు ఐరన్‌ స్టాండ్‌ను తీసుకెళ్తుండగా.. అది 11 కేవీ విద్యుత్‌ లైన్‌కు తగలడంతో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement