సాక్షి, భద్రాద్రికొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలోని పెద్దమ్మతల్లి దేవాలయంలో భారీ చోరీ జరిగింది. అమ్మవారి మెడలోని బంగారు తాళిబొట్టు, ముక్కుపుడకతో పాటు వెండి గొడుగు చోరీకి గురయ్యాయి.
మంగళవారం ఉదయం ఆలయం తెరిచిన పూజారులు చోరీ జరిగిన విషయం గమనించి పోలీసులకు ఫిర్యాదుచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆలయాన్ని పరిశీలించారు. ఇదే ఆలయంలో గతంలో నాలుగు సార్లు చోరీ జరిగింది. మూడుసార్లు నగదు, ఒకసారి బంగారు, వెండి నగలు చోరీ అయినట్లు గ్రామస్తులు తెలిపారు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దొంగల కోసం గాలింపుచర్యలు చేపట్టారు.