శ్రీకాకుళం డీఎస్పీ ఆత్మహత్య

Srikakulam special branch DSP Krishna Varma Decreased - Sakshi

సాక్షి, విశాఖ : అనారోగ్య కారణాలతో ఓ పోలీస్‌ అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. శ్రీకాకుళం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ వర్మ శుక్రవారం విశాఖ బీచ్‌ రోడ్డులోని తన నివాసంలో ఉరి వేసుకున్నారు. ఆయనకు ఇటీవలే హార్ట్‌ ఆపరేషన్‌ కూడా అయ్యింది. కృష్ణ వర్మ శ్రీకాకుళం జిల్లాలో దాదాపు పదేళ్లపాటు ఎస్‌ఐగా పని చేశారు. అనంతరం డీఎస్పీగా పదోన్నతి లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. 

ఈ ఘటనపై ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌ సీఐ షణ్ముఖరావు మాట్లాడుతూ.. ‘కృష్ణవర్మ ప్రస్తుతం స్పెషల్‌ బ్రాం‍చ్‌లో డీఎస్పీగా పని చేస్తున్నారు. ఆయన కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం వర్మ మృతి చెందిన సమాచారం అందింది. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మృతదేహాన్ని కేజీహెచ్‌ మార్చరీకి తరలించారు. వర్మ ప్రమాదవశాత్తు మృతి చెందారా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనేది పోస్ట్‌మార్టం నివేదిక వచ్చాక తెలుస్తుంది’ అని తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top