మంత్రించి మాయ చేశాడు

Mother And Baby Kidnap In Kurnool - Sakshi

డోన్‌ రూరల్‌ (కర్నూలు): ఓర్వకల్లు మండలం ఉప్పలపాడుకు చెందిన ఓ వ్యక్తి మంత్రాలతో మాయ చేసి తన భార్య, కూతురును ఎత్తుకెళ్లాడని డోన్‌ కొండపేటకు చెందిన శీను పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడు, పోలీసుల వివరాల మేరకు.. ఆటో నడుపుతూ జీవనం సాగించే శీనుకు భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కూతుళ్లున్నారు. కుటుంబ సమస్యల్లో ఉన్న వీరికి ఉప్పలపాడుకు చెందిన రంగస్వామి పరిచమయ్యాడు. ఇంట్లో శని ఉందని, దాన్ని తొలగిస్తే మంచి జరుగుతుందని, ఇందుకు కొన్ని రోజుల పాటు పూజలు చేయాలని సూచించాడు.

ప్రతి రోజు ఇంటికి వచ్చి మంత్రాలు చదివి పూజలు చేసేవాడు. ఇలా 20 రోజులయ్యే సరికి తన భార్య అతని మాయలో పడిందని రంగస్వామి తెలిపాడు. తనకు కూడా తల తిరగడం, మతి లేకుండా పోవడం జరుగుతోందన్నా డు. అతడు సూచించిన స్థలానికి వెళ్లి రావాలని చెప్పగా శనివారం మధ్యాహ్నం వెళ్లానని, తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య లక్ష్మిదేవి, చిన్న కూతురు సంజన(4)ను రామస్వామి బైక్‌పై ఎక్కించుకుని వెళ్లినట్లు ఇరుగుపొరుగువాళ్లు తెలిపారన్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీహరి తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top