గర్భిణిపై అత్యాచారయత్నం | Molestation Assault on Pregnant Woman in Chittoor | Sakshi
Sakshi News home page

గర్భిణిపై అత్యాచారయత్నం

Mar 27 2020 9:46 AM | Updated on Mar 27 2020 9:46 AM

Molestation Assault on Pregnant Woman in Chittoor - Sakshi

చిత్తూర్, కేవీబీపురం: ఏడు నెలల గర్భిణిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించిన ఘటన గురువారం బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం  మండలంలోని అంజూరు దళితవాడకు చెందిన సాయి(24), వినోద్‌(25)  అంజూరు గ్రామం తెలుగుగంగ కాలువ సమీపంలో ఉన్న సొంత పొలాల వద్దకు వెళ్లి తిరిగి గిరిజన కాలనీ వైపు వచ్చారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఏడు నెలల గర్భిణిని గమనించి అత్యాచారయత్నానికి పాల్పడ్డారు. ఆమె ప్రతిఘటించడంతో వినోద్‌ బయటికి వెళ్లిపోయాడు. సాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు కేకలు పెట్టింది. దీంతో స్థానికంగా ఉన్న కూలీలు అక్కడికి చేరుకోవడంతో నిందితులు పరారయ్యారు. దీనిపై బాధితులు కేవీబీపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement