బేగంపేటలో దారుణ హత్య | Sakshi
Sakshi News home page

బేగంపేటలో దారుణ హత్య

Published Tue, Nov 26 2019 9:09 PM

Man Murdered In Begumpet Lanka Basti - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని బేగంపేటలో దారుణం జరిగింది. శ్రీలంక బస్తీలో రషీద్‌ అనే వ్యక్తిని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. రషీద్‌ను హత్య చేసిన అనంతరం నిందితులు ఇంతియాజ్‌​, ఇమ్రాన్‌లు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఘటన స్థలానికి చేరకున్న క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరిస్తుంది. ఈ హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. రషీద్‌ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, నెల రోజుల్లోనే బేగంపేట పరిధిలో రెండో హత్య జరగడం కలకలం రేపుతోంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement