తంతడి బీచ్‌లో యువకుడి గల్లంతు

Man Missing in Beach Visakhapatnam - Sakshi

విశాఖపట్నం  ,అచ్యుతాపురం(యలమంచిలి):  సరదా గడిపేందుకు ఆదివారం తంతడి బీచ్‌కు వచ్చిన స్నేహితుల్లో ఒకరు సముద్రంలో గల్లంతయ్యారు.  ఇద్దరు స్నేహితులు  స్నానం చేస్తుంగా పెద్ద కెరటం రావడంతో  ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఎస్‌ఐ లక్ష్మణరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా మామిడాడ మండలం పెద్దాడ గ్రామానికి చెందిన  పొన్నమల వెంకటసత్యసాయి(24), అదే మండలానికి చెందిన మరో నలుగురు యువకులు రాఘవేంద్ర, తులసీరావు, నూకేష్, రాజు పరవాడలో గోదావరి ప్లాస్టో కంటైనర్స్‌ సంస్థలో పనిచేస్తున్నారు. వీరంతా పరవాడలో నివాసం ఉంటున్నారు.  ఆదివారం  స్నేహితులంతా తంతడిబీచ్‌కి వచ్చారు. 

తులసీ, వెంకటసత్య సాయి స్నానానికి దిగారు. పెద్ద కెరటం రావడంతో వెంకటసత్యసాయి  గల్లంతయ్యాడు. స్నేహితులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన ఎస్‌ఐ లక్ష్మణరావు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో రాత్రివరకూ గాలింపు నిర్వహించారు.  సత్యసాయి ఆచూకీ లభించలేదు. సాయి కుటుంబసభ్యులకు సమాచారం పంపి, తీరం వద్ద నిఘా ఏర్పాటుచేశారు. సాయి క్షేమంగా రావాలని తోటి మిత్రులు ప్రార్థిస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top