సిరిసిల్ల జిల్లాలో జంటహత్యలు | Father And Son Brutally Murdered In Rajanna Sircilla District | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల జిల్లాలో జంటహత్యలు

Jun 12 2018 12:07 PM | Updated on Aug 21 2018 6:08 PM

Father And Son Brutally Murdered In Rajanna Sircilla District - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం తండ్రి కొడుకులు దారుణహత్యకు గురయ్యారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టాపూర్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు తండ్రి కొడుకులను కత్తులతో పొడిచి హత్య చేశారు. ఈ జంట హత్యల ఘటన స్థానికంగా కలకం రేపింది. గ్రామానికి చెందిన ఎల్లయ్య, అతని కొడుకును అదే గ్రామానికి చెందిన వ్యక్తులు గొడ్డలితో దాడి చేసి హతమార్చారు.

పొలం విషయంలో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది. ఈరోజు తెల్లవారుజామున పొలంలో ఉన్న తండ్రికొడుకులను హత్యచేసిన నిందితులు ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటన విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement