బాలుడి తలపై బండరాయితో బాది.. | 7 Years Old Stoned To Death In Maharashtra | Sakshi
Sakshi News home page

బాలుడి తలపై బండరాయితో బాది..

Aug 3 2018 8:48 PM | Updated on Aug 3 2018 11:44 PM

7 Years Old Stoned To Death In Maharashtra - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ముంబై : ఏడేళ్ల బాలుడి తలపై బండరాయితో మోది హత్య చేశారు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌ పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌కు చెందిన దిగ్విజయ్‌ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. దిగ్విజయ్‌కి చెందిన ఇంట్లో అద్దెకు ఉండే ఓ వ్యక్తికి అతడికి తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌ ఏడేళ్ల కుమారుడు శివమ్‌ రాజత్‌ బుధవారం నుంచి కనిపించకుండా పోయాడు. దిగ్విజయ్‌ కొడుకు కోసం చుట్టుపక్కల ఎంత వెతికినా లాభం లేకపోయింది.

దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజు అక్కడికి దగ్గరలోని అంబర్‌నాథ్‌ కొండలపై ఏడేళ్ల బాలుడి శవాన్ని పోలీసులు గుర్తించారు. ముఖంపై బండరాయితో బాదటం వల్ల గుర్తుపట్టలేని స్థితిలో బాలుడి శవం ఉంది. పోలీసులు దిగ్విజయ్‌ దంపతులకు సమాచారమివ్వటంతో వారు అక్కడి చేరుకుని ఒంటిపై ఉన్న దుస్తుల ఆధారంగా బాలుడ్ని శివమ్‌ రాజత్‌గా గుర్తించారు. దిగ్విజయ్‌ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తిని పోలీసులు అనుమానిస్తున్నారు. గొడవల కారణంగానే ఈ హత్య చేసి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement