
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో హుషారుగా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ ఆరంభంలోనే డబుల సెంచరీ కొట్టింది. ప్రస్తుతం 304 పాయింట్లు లాభపడి 39351 వద్ద, నిఫ్టీ 91 పాయింట్లు ఎగిసి 11785 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ లాభాలు మార్కెట్లకు మద్దతునిస్తున్నాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, కెనరా బ్యాంకు, పీఎన్బీ,బీవోబీ టాప్ విన్నర్స్గా ఉన్నాయి. ఇక జెట్ ఎయిర్వేస్ (ఫ్యూచర్స్) పతనానికి అడ్డే లేదు.